Venkateswara Stotram | శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం: శేషాచలపతిని స్తుతించే దివ్య స్తోత్రం!

Venkateswara Stotram Tel

“శ్రీ వేంకటేశ్వర స్తోత్రం – Venkateswara Stotramతిరుమల కొండపై (Tirumala) కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ రచించబడిన ఒక ప్రసిద్ధ మరియు పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రం స్వామివారి యొక్క మహిమలను, ఆయన కరుణా కటాక్షాలను మరియు దివ్యత్వాన్ని వర్ణిస్తుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని మరియు ఆయన అనుగ్రహం పొందాలని ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్తోత్రంను ప్రతి రోజు పఠించినా విష్ణు లోకం (Vishnu Loka) ప్రాప్తి మరియు వేంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోగలరు.

ఈ స్తోత్రం పఠించే వారికి ఆత్మసాక్షాత్కారం మరియు భగవంతుని కృప అనుగ్రహాన్ని మరియు ఆత్మోద్ధారణ పొందగలరు. వేంకటేశ్వర స్వామిని ఆరాధించే ఈ స్తోత్రం అమృత ప్రాశనంలాగా, అంతరంగ శుధ్ధి మరియు ప్రశాంతత లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్తోత్రం నిత్యమున పఠించినా, విద్య, ధన, ఆరోగ్య, ప్రేమ, శాంతి, భక్తి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని లభిస్తుంది.

Venkateswara Stotram యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత:

  • స్వామివారి అనుగ్రహం: ఈ స్తోత్రం పఠించడం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసన్నులై భక్తులను అనుగ్రహిస్తారని విశ్వసిస్తారు.
  • కోరికల నెరవేర్పు: భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠించేవారి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
  • కష్టాల నివారణ: జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు మరియు సమస్యల నుండి విముక్తి పొందడానికి ఈ స్తోత్రం ఒక శక్తివంతమైన సాధనంగా పరిగణించబడుతుంది.
  • ఆధ్యాత్మిక ఉన్నతి: ఈ స్తోత్రంలోని శ్లోకాలు స్వామివారి యొక్క దివ్య గుణాలను స్మరించుకునేలా చేస్తాయి, తద్వారా భక్తులలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయి.
  • పాప ప్రక్షాళన: ఈ స్తోత్రం పఠించడం వల్ల పూర్వ జన్మల పాపాలు మరియు కర్మ దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
  • మానసిక శాంతి: ఈ స్తోత్రం యొక్క పఠనం మనసుకు శాంతిని మరియు ప్రశాంతతను కలిగిస్తుంది.

ప్రత్యేకముగా శనివారం (Saturday) రోజున శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు. శనివారం రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణ చేస్తే అద్భుత ఫలితాలను కలుగ చేస్తాడని భక్తుల నమ్మకం.

Venkateswara Swamy – శ్రీ వేంకటేశ్వర స్వామిని అనేక పేర్లతో భక్తితో కొలచడము వల్ల స్వామి వారి ఆశీర్వాదములను పొందగలుగుతారు. వాటిలో కొన్ని పేర్లు:

శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులు అనేక పేర్లతో పిలుచుకొంటారు. వాటిలో కొన్నిశ్రీనివాస (Srinivasa), బాలజీ (Balaji), వేంకటాచల పతిరాజ (Venkata Chalapathi raja), శ్రీనివాస పెరుమాళ (Srinivasa Perumal), తిరువేంకట నాయకుడు (Tiru Venkata Nayaka), తిరు వేంకనాథుడు (Tiru Venkata Natha), తిరు వేంకటేశ్వర స్వామి (Tiru Venkateswara Swamy), వేంకటాచలేశ్వరుడు (Venkatachaleswara), తిరు వేంకటా చలపతి (Tiru Venkata chapathi), తిరు వేంకటాచలేశ్వర స్వామి (Tiru Venkatachaleswara Swamy), వేంకటేశ్వర పెరుమాళ (Venkateswara Perumal).

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ॥

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥

|| ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో శ్రీ శ్రీనివాసాయ ||

Credits: @ISKCONBangaloreMusic

Also Read

Leave a Comment