వైశాఖ పురాణం – 11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క పదకొండవ అధ్యాయం కామదేవుని భార్య రతి యొక్క దుఃఖం, దేవతల ఊరడింపు గురించి వివరిస్తుంది. తన భర్త కామదేవుడు శివుడి (Lord Siva) కోపానికి గురై దహించబడటం తో రతి తీవ్ర దుఃఖానికి లోనవుతుంది. ఆమె తన భర్తను తిరిగి పొందాలని కోరుకుంటూ, సతీదేవిలా సహగమనం చేయాలని నిర్ణయించుకుంటుంది. దేవతలు, మునులు రతిని ఊరడించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గలేదు. చివరగా, శివుడు కనిపించి, రతికి వరాలను ఇస్తాడు.
కామదేవుడు రెండవ జన్మలో శ్రీకృష్ణుని (Lord Krishna) కుమారుడు ప్రద్యుమ్నుడిగా (Pradyumna) జన్మిస్తాడని, రతి శంబరాసురుడి కుమార్తెగా జన్మించి, పెరిగి ప్రద్యుమ్నుడిని పెళ్లి చేసుకుంటుందని శివుడు వరమిస్తాడు. ఈ వరాలతో రతి సంతృప్తి చెంది, తన సహగమన నిర్ణయాన్ని వదులుకుంటుంది. వైశాఖ పురాణం – 11 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 11) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 11
వైశాఖ పురాణం – 11 వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
నారదమహర్షి (Narada Muni) అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలా పతియగు శ్రుతకీర్తి శ్రుత దేవుని ముక్కంటి కంటి మంటకు యెర అయిన ఆ మన్మధుని(Manmatha) జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడు ఎట్టి దుఃఖమును అనుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.
కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.
శివుని కంటిమంటకు మన్మధుడుబ దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.
ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను.
వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను ఆమె గంగా స్నానము (Ganga River) చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితిని ఎక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతి భక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము ఎత్తిన శ్రీమహావిష్ణువు (Lord Vishnu) వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి (Rukmini Devi) ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాసురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు.
ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి (Brihaspati) ఇంద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతి దేవిని బహువిధములుగ ఊరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేని వాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధా పూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి.
కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే యితని భార్యవు. అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్య శయన వ్రతమును ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.
రతి దేవియు (Rati Devi) అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేష రాశిలో (Mesha Rasi) నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము నాచరించుచు అశూన్య శయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధా పూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖ దానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున యిహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము (Vaisakha Vrut) నాచరింపవలయును సుమా!
వైశాఖ పురాణం 11వ అధ్యాయం సమాప్తం.
Read more Puranas: