Sri Vinayaka Vrata Kalpam – శ్రీ వినాయక వ్రత కల్పం

Sri Vinayaka Vrata Kalpam

వినాయక చవితి అనేది ప్రతి హిందువు ఇంటా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ రోజున సకల శుభాలకు మూలమైన శ్రీ వినాయక స్వామిని ఆరాదించేందుకు చేయు పూజా విధానము శ్రీ వినాయక వ్రత కల్పం – Sri Vinayaka Vrata Kalpam. ఆయన బుద్ధికి, జ్ఞానానికి అధిపతి. ఏ కార్యాన్ని ప్రారంభించినా, ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. దీనివల్ల ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. వినాయక చవితి రోజున మట్టి గణపతిని ప్రతిష్టించి, ఆయనకు ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు (Modakalu) వంటి నైవేద్యాలను సమర్పించి, ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజిస్తారు.

ఈ పవిత్రమైన వినాయక వ్రత కల్పంలో, గణపతి (Lord Ganapati) పూజకు సంబంధించిన పూర్తి విధానం, పూజలో చదవవలసిన శ్లోకాలు, కథలు, మరియు ఆచారాలు వివరించబడ్డాయి. ఈ కల్పం ద్వారా భక్తులు వినాయకుడిని (Lord Vinayaka) సరైన పద్ధతిలో పూజించి, ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. వినాయక చవితిని (Vinayaka Chavithi) ఎలా జరుపుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, మరియు పూజ తర్వాత చేయవలసిన కార్యక్రమాల గురించి ఈ కల్పం వివరంగా తెలియజేస్తుంది. వినాయక వ్రతం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, అది మన మనసును శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మిక అనుభవం.

పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమల పాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు (Panchamrita), తోరము, దీపారాధన కుందులు, నెయ్యిలేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి  ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.

వినాయక చవితి (Ganesha Chavithi) రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని (Lord Ganesha Idol) వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.

వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.

ఓం కేశవాయ స్వాహాః

నారాయణాయ స్వాహాః

మాధవాయ స్వాహాః

(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః

విష్ణవే నమః

మధుసూదనాయ నమః

త్రివిక్రమాయ నమః

వామనాయ నమః

శ్రీధరాయ నమః

హృషీకేశాయ నమః

పద్మనాభాయ నమః

దామోదరాయ నమః

సంకర్షణాయ నమః

వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః

అనిరుద్దాయ నమః

పురుషోత్తమాయ నమః

అధోక్షజాయ నమః

నారసింహాయ నమః

అచ్యుతాయ నమః

ఉపేంద్రాయ నమః

హరయే నమః

శ్రీ కృష్ణాయ నమః

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను)

1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం

2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:

3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యము: 

మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః

ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః

ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః

ఓం శచీపురందరాభ్యాం నమః

ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః

ఓం శ్రీ సితారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

(క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

శ్లోకాము:

ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓం ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)

(ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజేఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥

ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

మధుపర్కం సమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వంబోదరహరాత్మజ ॥

వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

పుష్పాణి పూజయామి.

(పుష్పములతో పూజించవలెను)

గణేశాయ నమః – పాదౌ పూజయామి

ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి

శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి

విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి

అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి

హేరంబాయ నమః – కటిం పూజయామి

లంబోదరాయ నమః – ఉదరం పూజయామి

గణనాథాయ నమః – నాభిం పూజయామి

గణేశాయ నమః – హృదయం పూజయామి

స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి

గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి

విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి

శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి

ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి

సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి

విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి

ప్రధాన వ్యాసము: ఏకవింశతి పత్రపూజ

(21 విధముల పత్రములతో పూజింపవలెను)

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి

గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి

ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి

గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి

లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి

గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి

గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి

ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి

వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి

భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి

వటవేనమః – దాడిమీపత్రం పూజయామి

సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి

ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి

హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి

సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి

ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి

వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి

సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి

కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి

శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః 

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే||

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

ధూపమాఘ్రాపయామి॥

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్, భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక 

నైవేద్యం సమర్పయామి।

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

తాంబూలం సమర్పయామి।

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి।

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. 

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన, పునరర్ఘ్యం సమర్పయామి. 

ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు మొదట తమ చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో, సప్తఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు. అప్పుడు అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, వారేమైనా శపిస్తారేమోనన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి, ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నితో ఉన్నది తమ భార్యలేనని పొరబడిన సప్తఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుడిని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మదేవుడు మరణించిన విఘ్నేశ్వరుడిని తిరిగి బతికించాడు. ఆ తర్వాత పార్వతీదేవితో, “అమ్మా, నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో” అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, “ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు” అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుండి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో ఆడిన మాయాజూదం వల్ల తన రాజ్యాన్ని పోగొట్టుకుని, భార్య, సోదరులతో కలిసి వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, తనకు తిరిగి రాజ్యాన్ని పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సూతమహర్షి సర్వశుభాలను ఇచ్చే వినాయక చవితి వ్రతం గురించి వివరించడం మొదలుపెట్టాడు. విఘ్నేశ్వరుని జననం, చంద్రదర్శనం వల్ల కలిగే దోషం, మరియు శాపవిమోచనం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాడు.

గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో పరమేశ్వరుడిని మెప్పించి, తనను ఎవరూ వధించలేరని, మరియు శివుడు తన కడుపులోనే నివసించాలని కోరాడు. శివుడు ఆ వరాన్ని ప్రసాదించడంతో అతడి కుక్షిలో బందీ అయ్యాడు. దీంతో గజాసురుడు అజేయుడుగా మారాడు.

తన భర్తకు కలిగిన ఈ దుస్థితిని చూసి పార్వతీదేవి ఎంతో దుఃఖించింది. జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది. అప్పుడు విష్ణువు గంగిరెద్దుల వాని వేషం ధరించి, నందీశ్వరుడిని గంగిరెద్దుగా వెంట తీసుకుని గజాసురుడి వద్దకు వెళ్ళాడు. గంగిరెద్దును ఆడించి రాక్షసుడిని మెప్పించాడు. ఆనందంతో ‘ఏమి కావాలో కోరుకో’ అని గజాసురుడు అనగా, ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు, “నీ కడుపులో ఉన్న శివుడిని తమ వశం చేయమని” అడిగాడు. తన అంత్యకాలం సమీపించిందని గుర్తించిన రాక్షసుడు, ఇచ్చిన మాట తప్పకుండా తన కడుపులో ఉన్న శివుడిని ఉద్దేశించి, “ప్రభూ, శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగుస్తుంది. నా ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు ముల్లోకాల్లో పూజింపబడాలి. నా చర్మాన్ని నీవు నిరంతరం ధరించాలి” అని ప్రార్థించి తన శరీరాన్ని నందీశ్వరుడికి అప్పగించాడు. నందీశ్వరుడు గజాసురుడి ఉదరాన్ని చీల్చి శివుడికి విముక్తి కల్పించాడు. శివుడు గజాసురుడి శిరస్సు, చర్మాన్ని తీసుకుని తన నివాసానికి బయలుదేరాడు.

సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను: ఒకసారి గజముఖాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుడిని మెప్పించి, ఒక అసాధారణమైన వరం కోరాడు. తనను ఎవరూ వధించలేరని, మరియు శివుడు తన కడుపులోనే ఎప్పటికీ నివసించాలని ఆ వరం. శివుడు ఆ వరాన్ని ప్రసాదించడంతో, ఆయన గజముఖాసురుని కుక్షిలో బందీ అయ్యాడు. ఆ రాక్షసుడు తిరుగులేని శక్తిమంతుడుగా మారాడు.

తన భర్తకు కలిగిన ఈ దుస్థితిని చూసి పార్వతీదేవి (Goddess Parvati) ఎంతో దుఃఖించింది. ఈ లోకానికి శంకరుడు లేని స్థితిని, జగన్మాత అయిన పార్వతి తట్టుకోలేకపోయింది. వెంటనే, భర్తను విడిపించే ఉపాయం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణువు గంగిరెద్దుల వాని వేషం ధరించి, నందీశ్వరుడిని గంగిరెద్దుగా వెంట తీసుకొని గజముఖాసురుడి వద్దకు వెళ్ళాడు. గంగిరెద్దుల ఆటతో ఆ రాక్షసుడిని సంతోషపరిచాడు. ఆనందంతో గజముఖాసురుడు “ఏమి కావాలో కోరుకో” అన్నాడు. శ్రీహరి వ్యూహం ఫలించింది. విష్ణువు (Lord Vishnu), “నీ కడుపులో ఉన్న శివుడిని తీసుకెళ్ళడానికి ఈ నందీశ్వరుడు వచ్చాడు. శివుడిని నందీశ్వరుడికి అప్పగించు” అన్నాడు.

గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైంది. తన అంత్యకాలం సమీపించిందని తెలుసుకున్నాడు. అయినా ఇచ్చిన మాట తప్పలేక, కడుపులోని శివుడిని ఉద్దేశించి, “ప్రభూ! శ్రీహరి (Sri Hari) ప్రభావం వల్ల నా జీవితం ముగుస్తుంది. నా మరణానంతరం నా శిరస్సు ముల్లోకాలలో పూజింపబడాలి, మరియు నా చర్మాన్ని నీవు నిరంతరం ధరించాలి” అని ప్రార్థించాడు. వెంటనే తన శరీరాన్ని నందీశ్వరునికి అప్పగించాడు. నందీశ్వరుడు (Nandeswara) అతని కడుపును చీల్చి శివుడిని బయటకు తీసుకొచ్చాడు. శివుడు గజముఖాసురుడి శిరస్సును, చర్మాన్ని తీసుకొని స్వస్థానానికి బయలుదేరాడు.

మరోవైపు, పార్వతి తన భర్త తిరిగి వస్తున్నాడని విని ఎంతో సంతోషించింది. ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ, తన స్నానం కోసం ఉంచిన నలుగుపిండితో ఉల్లాసంగా ఒక మనిషి ప్రతిమను తయారు చేసింది. అది చూడటానికి ఎంతో అందమైన బాలుడిలా కనిపించింది. ఆ ప్రతిమకు ప్రాణం పోయాలన్న కోరికతో, పార్వతి తన తండ్రి పర్వతరాజు నుండి పొందిన గణేశ మంత్రాన్ని ఉపయోగించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందర బాలుడిని ఇంటి వాకిట కాపలా ఉంచి, తన పనుల కోసం లోపలికి వెళ్ళింది.

కొంతసేపటికి శివుడు (Lord Shiva) ఇంటికి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు ఆయనను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంటిలో తనకే అడ్డంకా? శివుడు కోపంతో ఆ బాలుడి శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళాడు. జరిగిన విషయం విని పార్వతి తీవ్రంగా విలపించింది. తన తప్పు తెలుసుకున్న శివుడు వెంటనే తన వద్ద ఉన్న గజముఖాసురుడి శిరస్సును ఆ బాలుడి మొండెమునకు అతికించాడు. ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని, ముల్లోకాలలో పూజింపబడే వరాన్ని ఇచ్చాడు. అలా గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టిగా మారాడు. విగతజీవుడైన గజముఖాసురుడు, పునీతుడై మూషిక రూపంలో వినాయకుడికి వాహనమై శాశ్వత స్థానాన్ని పొందాడు.

గణపతి అగ్రపూజనీయుడు. గణేశుడికి ఆ స్థానం లభించాలి. అయితే శివుడి రెండవ కుమారుడైన కుమారస్వామి (Lord Kumara Swamy) ఆ స్థానం తనకే కావాలని కోరాడు. అప్పుడు శివుడు ఇద్దరికీ ఒక పోటీ పెట్టాడు: “మీలో ఎవరు ముల్లోకాల్లోని పవిత్ర నదులలో స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వస్తారో, వారికి ఆధిపత్యం లభిస్తుంది.” కుమారస్వామి తన వాహనం మీద వేగంగా బయలుదేరాడు. గణేశుడు మాత్రం అక్కడే నిలిచిపోయి, త్రిలోకాలలోని నదీ స్నాన ఫలాన్ని ఇచ్చే ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. గణపతి బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు, అటువంటి ఫలాన్ని ఇచ్చే నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. ‘నారములు’ అనగా జలములు, జలాలన్నీ నారాయణుడి ఆధీనంలో ఉంటాయి. మంత్ర ప్రభావంతో, కుమారస్వామి ఏ నదిలో స్నానం చేసినా, వినాయకుడు అతనికన్నా ముందే ఆ నదిలో ప్రత్యక్షమయ్యాడు. అలా వినాయకుడికే అగ్రపూజనీయ స్థానం లభించింది.

సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుని కోరారు. ఈ విషయంలో గణపతిని, కుమారస్వామిని ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు, ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా ఎగిరి వెళ్ళగా, వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేకపోయాడు. అప్పుడు వినాయకుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ మంత్ర ప్రభావంతో, కుమారస్వామి ఏ తీర్థంలో స్నానం చేసినా, వినాయకుడు ఆయనకంటే ముందే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా మూడు కోట్ల నదులలో వినాయకుడే ముందుగా స్నానం చేయడం చూసిన కుమారస్వామి కైలాసానికి తిరిగి వెళ్లి, మహిమాన్వితుడైన తన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు.

గణేశుడు జ్ఞానానికి, పూజలకు అధిపతి, జగత్తుచేత పూజింపబడేవాడు. కానీ ఈ విషయాన్ని మర్చిపోయిన చంద్రుడు (మనసుకు సంకేతం), వినాయకుడి వింత రూపాన్ని చూసి బిగ్గరగా నవ్వాడు. దాని ఫలితంగా చంద్రుడు లోకానికి అనుసరణీయుడు కాకుండా పోయాడు. అతని గౌరవం నశించి, నిందలకు గురయ్యాడు. లోకం అతనిని చూడటానికి విముఖత చూపాలి. ఎందుకంటే, ఎవరైనా చంద్రుడిని చూస్తే, వారు కూడా అజ్ఞానంతో కూడిన నిందలకు గురి అవుతారని శాపం వచ్చింది.

చంద్రుడికి వచ్చిన శాపం లోకానికీ శాపంగా మారింది. చంద్రుడిని చూడకుండా ఉండటం లోకానికి అసాధ్యం. నీలాపనిందల మధ్య జీవితాన్ని సవ్యంగా సాగించడం ఎలాగో తెలియక చంద్రుడు, లోకులు గణపతిని ప్రార్థించారు. తన పొరపాటుకు పశ్చాత్తాపపడిన చంద్రుడు, ఈ శాపం నుండి విముక్తి కోసం వినాయకుడిని వేడుకున్నాడు. దయామయుడైన గణపతి, ఈ శాపం నుండి విముక్తి పొందే ఉపాయాన్ని సూచించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున తనను పూజించి, తన కథను విని, తల మీద అక్షతలు వేసుకుంటే నిష్కళంకమైన జీవితం సాధ్యమవుతుందని అనుగ్రహించాడు. ఈ నియమం అందరికీ తప్పనిసరిగా పాటించాల్సిన విధిగా చెప్పబడింది. ఈ విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఎంతటి వారికైనా నిందలు తప్పవని శ్యమంతకమణి కథ ద్వారా మరింత స్పష్టమవుతుంది.

ఒక వినాయక చవితి రోజున శ్రీకృష్ణుడు (Lord Sri Krishna) అపశకునంగా పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాని దుష్ఫలితం ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అనే రాజు సూర్యభగవానుడిని ఉపాసించి, రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇవ్వగల శ్యమంతకమణి (Syamantakamani) అనే శక్తివంతమైన మణిని పొందాడు. అంతటి విలువైన మణి ఒక పాలకుడి వద్ద ఉండాలని ధర్మజ్ఞుడైన శ్రీకృష్ణుడు భావించి, ఆ విషయాన్ని సత్రాజిత్తుకు సూచించాడు. కానీ సత్రాజిత్తుకు ఆ సూచన నచ్చలేదు.

ఆ తర్వాత, సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి సరదాగా వేటకై అడవికి వెళ్ళాడు. ఆ మణిని మాంసపు ముక్కగా భ్రమించిన ఒక సింహం అతడిని చంపి, మణిని నోట కరచుకొని పారిపోయింది. నిజం తెలియని సత్రాజిత్తు, మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఉంటాడని అనుమానించి ఆయనపై నింద వేశాడు. ఆ నిందను తొలగించుకోవడం శ్రీకృష్ణుడికి తప్పనిసరి అయ్యింది.

శ్రీకృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించి, ఒకచోట ప్రసేనుడి కళేబరాన్ని చూశాడు. అక్కడ కనిపించిన సింహం అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్ళగా, మరోచోట సింహం, ఎలుగుబంటి (భల్లూకం) పోరాడిన ఆనవాళ్ళు కనిపించాయి. శ్రీకృష్ణుడు ఎలుగుబంటి అడుగుల జాడలను అనుసరించి ఒక గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ఊయలలో ఉన్న బాలుడికి మణి వేలాడదీసి ఉండటం చూశాడు. ఆ మణిని అందుకోవడానికి శ్రీకృష్ణుడు ప్రయత్నించగా, భయంకరమైన ఎలుగుబంటి ఆయనపై దాడి చేసింది.

వారిద్దరి మధ్య ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా ఇరవై ఎనిమిది రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. క్రమంగా ఆ ఎలుగుబంటి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఆ ఎలుగుబంటి సామాన్యమైనది కాదు, అది రామాయణ కాలం నాటి మహా భక్తుడు, మహా శక్తివంతుడు అయిన జాంబవంతుడు (Jambavant). అతని కర్మబంధాలు ఇంకా విడిపోనందున జీవించి ఉన్నాడు. జాంబవంతుడు అజేయుడు, శ్రీరామచంద్రుడి వల్ల మాత్రమే అతని బలం క్షీణించడం సాధ్యం. ఈ విషయం గ్రహించిన జాంబవంతుడు, తాను పోరాడుతున్నది సాక్షాత్తు శ్రీరాముడితోనేనని గుర్తించి, స్తోత్రం చేయసాగాడు.

జాంబవంతుడు త్రేతాయుగంలో శ్రీరాముని (Lord Sri Rama) సేవలకు మెచ్చి ఒక వరం కోరుకొమ్మని రాముడు అడిగినప్పుడు, తన అవివేకంతో శ్రీరాముడితో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాడు. అది ఆ సమయంలో శ్రీరాముడి కార్యం కాకపోవడంతో నెరవేరలేదు. ఆ కోరిక జాంబవంతుడికి కర్మబంధంగా మిగిలిపోయింది. ఇప్పుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని రూపంలో ఆ ద్వంద్వ యుద్ధం సంభవించడంతో అతని అవివేకం, అహంభావం నశించాయి. శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడే అని గ్రహించి, జాంబవంతుడు ఆ మణిని, తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికి సమర్పించి కర్మబంధ విముక్తి పొందాడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరానికి తిరిగి వచ్చి, ప్రజలను పిలిచి జరిగిన విషయాన్ని వివరించి తనపై ఉన్న నిందను పోగొట్టుకున్నాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు పశ్చాత్తాపపడి, మణితో పాటు తన కుమార్తె సత్యభామను (Satya Bhama) శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ధర్మంగా మణిని నిరాకరించి, సత్యభామను మాత్రమే స్వీకరించాడు.

వినాయక వ్రతం చేయకుండా చంద్రబింబాన్ని చూసిన కారణంగా స్వయంగా నిందను అనుభవించిన శ్రీకృష్ణుడు, ప్రజల పట్ల దయతో ఒక వరాన్ని ఇచ్చాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడిని శక్తికొలది పూజించి, ఈ శ్యమంతకమణి కథను విన్నట్లైతే లేదా చదువుకున్నట్లైతే, వారికి ఎలాంటి నిష్కారణ నిందలు రాకుండా ఉంటాయని అనుగ్రహించాడు. అప్పటినుండి ఈ కథను వినాయక చవితి నాడు వినడం మన సాంప్రదాయంగా మారింది.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, “మీరు సమర్థులు కాబట్టి మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మరి మావంటి వారికి ఏది గతి?” అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు, “భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి, ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు” అని వరాన్ని ఇచ్చాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.

పూజ చేసి కథను మొత్తం వినే అవకాశం లేనివారు, ఈ కింది శ్లోకాన్ని పఠించడం ద్వారా ఆ ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పబడింది:

“సింహః ప్రసేనమవధీత్, సింహో జాంబవతా హతః, సుకుమారక మా రోదీః, తవ హ్యేష శ్యమంతకః”

ఈ కథను చదివినా లేదా విన్నా, చివరగా తల మీద అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరిగా వినాయకుడి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

|| ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నో దంతి ప్రచోదయాత్ || 

Also Read

Leave a Comment