మాఘ పురాణం – 23 వ అధ్యాయము

మాఘ పురాణం (Magha Puranam) 23వ అధ్యాయంలో, ఇంద్రుడు (Indra) పారిజాత పుష్పాల మోహంలో పడి, స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, శ్రీహరి (Lord Vishnu) పాదాలకు నమస్కారం చేయకుండా, ఆయన నిర్మాల్యాన్ని దాటి పుష్పాలను కోయడానికి ప్రయత్నించడం వల్ల, దేవతలు తమ శక్తిని కోల్పోయి భూమిపై పడిపోతారు. అక్కడ వారిని చూసిన సత్యజిత్తు, వారి దుర్మార్గాన్ని గుర్తించి, వారికి ఆహారం ఇవ్వకుండా నిరాహార దీక్షతో శ్రీహరిని పూజించి దేవతలకు శక్తి తిరిగి రావాలని కోరుకుంటాడు. ఇదే సమయంలో, నారదుడు శ్రీహరిని దర్శించి దేవతల దురవస్థ గురించి తెలియజేస్తాడు. శ్రీహరి, నారదునితో, తాను ఎందుకు దేవతలను శిక్షించాల్సి వచ్చిందో వివరించి, ఏకాదశి (Ekadashi) నాడు ఉపవాసం, జాగరణ, మంత్ర జపం ద్వారా శక్తిని తిరిగి పొందవచ్చని చెబుతాడు.
ఈ అధ్యాయంలో మరో కథ కూడా ఉంది. నలుగురు బ్రాహ్మణ కన్యలు ఒక విద్యార్థిని వివాహం చేసుకోమని బలవంతపెట్టడం వల్ల, కోపంతో ఆ విద్యార్థి వారిని పిశాచులుగా మారాలని శపిస్తాడు. తరువాత, వారు మాఘమాసంలో గయలోని త్రివేణిలో స్నానం చేయడం ద్వారా పిశాచ రూపం నుండి విముక్తి పొందుతారు.చివరగా, మాఘమాసంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది, శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. మాఘ పురాణం – 22 వ అధ్యాయము (Magha Puranam – Day 23) నందు ఈ క్రింది విధముగా …
Magha Puranam – Day 23
నారదుని దౌత్యము – దేవతల దైన్యము
గృత్నృమద మహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పము పైనున్న ఇష్టము అధికముగా అగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను గూడ తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే (Parijata Plant) స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కిదాటిరి. ఫలితముగా దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తి విహీనూలు అయినారు, ఇంద్రాదులు ఇంకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత వృక్షమును పెకలింప దలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటడము వలన వారును శక్తి హీనులై పడియుండిరి.
మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా ! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ పుష్పములను (Flowers) దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా? అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు (Garutmanta) మొదలైన ఉత్తమ పక్షులు నేల పైన ఉన్న పైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రానియవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఏట్టిదో చెప్పుమని యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను.
ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు (Kamadhenu) ఇచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యధా పూర్వకముగ పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడ పదకొండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు (Narada Muni) ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికి ఎట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. నేరుగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి యిట్లు స్తుతించెను.
నారదకృత విష్ణుస్తుతి
ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే
గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||
మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే
శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||
అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ
సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||
నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే
భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||
నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన
సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||
సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి
పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||
పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః
సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||
త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః
ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||
త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే
జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||
త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో
గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||
ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం
ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||
నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరియేమియు నెరుగనివానివలె ‘నారదా! స్వాగతము ఇప్పుడెందులకీ స్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది యెట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని యడిగెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించు చుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్ట పడిన రంభ (Rambha) మొదలగు అప్సర (Apsara) స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలి పడిన మిడుత వలె దేవతా గుణములతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదునొకండు దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను.
నారదుని మాటలను విని శ్రీహరి ‘నారదా ! అమృత కలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను, తులసిగాను అయినది. అనగా ఆ రెండును అమృతము (Amrut) నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తను వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి, ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచూ ఉండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్పసంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును గూడ దాటెను త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వారి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కాని, తెలియక కాని దాటిన, తొక్కిన ఎంతటి వాడు అయినను అంతటి శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు.
ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ (Ashada) శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృత పానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని జూచి భార్యతోబాటు నిరాహారుడై యుండెను. దేవతల పుష్తికై నన్ను ప్రతిదినము అర్చించు చూనే ఉన్నాడు. నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడ ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమొనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు ఏవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానినిచ్చెదను అని విష్ణువు సమాధానము ‘ నిచ్చెను. నారదుడును ఏమియును మాటలు ఆడలేక తన దారిన పోయెను అని గృత్నృమద మహాముని జహ్నువునకు చెప్పెను.
బ్రాహ్మణ కన్యల విమోచనము కొంత కాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి. నలుగురకు నలుగురు కుమార్తెలు ఉండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామము లోనున్న కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్ధి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహము చేసుకోమని బలవంతము చేయగా, ఆ బ్రాహ్మణ విద్యార్థికి అతని విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించగా ఆ విద్యార్ధి కూడా “మీరు కూడా పిశాచులగుదురు గాక”యని ప్రతి శాపము ఇచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి.
కొంత కాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగి పోవును” అని చెప్పగా వారు అట్లు చేయుటచే ఆ నలుగురకూ యధా రూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే (Magha Snanam) కారణము.
Read more Puranas