మాఘ పురాణం | Magha Puranam – Day 2

మాఘ పురాణం – 2 వ అధ్యాయము

శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట

Magha Puranam - Day 2

Magha Puranam – Day 2

మాఘ మాసం హిందువులకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలు ఎంతో ఫలప్రదం అని భావిస్తారు. ఈ మాసంలో స్నానం, దానం, జపం, తపం వంటివి చేయడం వల్ల మోక్షం లభిస్తుందని చెబుతారు. మాఘ పురాణంలో (Magha Puranam) మాఘ మాసం యొక్క విశిష్టత గురించి, ఈ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాల గురించి వివరంగా చెప్పబడింది. ఈ పురాణం 28 అధ్యాయాలతో కూడి ఉంది.రెండవ అధ్యాయంలో శౌనకాది మునులు సూతునికి మాఘ మాసం యొక్క విశిష్టత గురించి అడుగుతారు. సూతుడు వారికి మాఘ మాసం యొక్క మహిమ గురించి వివరిస్తాడు. మాఘ పురాణం – 2 వ అధ్యాయము (Magha Puranam – Day 2) నందు ఈ క్రింది విధముగా …

వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను.” మహాముని! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి (Parvati Devi) శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన (Lord Shiva) శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస (Kailash Parvat)పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవివచ్చి భర్త పాదములకు నమస్కరించి, ‘స్వామీ మీ వలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని, కానీ, ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన, ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని’ వేడుకొనగా, పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను, దేవి! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

సూర్యుడు మకరరాశి (Makar Rashi) యందు వుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ (Prayag) క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను, లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని, తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయేగాక సమస్త పాపములను విడిపోవును. రెండవ రోజు స్నానముజేసిన విష్ణు లోకమునకు పోవును. మూడవ నాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును.

మాఘమాసము నందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో (Ganga River) స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ! మాఘమాస స్నాన ఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి, తనకు తోచిన దాన ధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక, కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియునుగాక, మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానముచేసి, శ్రీమన్నారాయణుని (Vishnu) పూజించి, సాయంకాల సమయంబున మాఘ పురాణము (Magha Puranam) చదివి, విష్ణు అందిరమునగాని, శివాలయమున గాని దీపము వెలిగించి, ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయేకాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు.

ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములుచేసి మరణారంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటె, తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి, దాన ధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ! యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధయముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీ స్నానముగాని, జపముగాని, విష్ణు పూజగాని, యధా శక్తి దానాది పుణ్య కర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపములచేత, ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికిపోయి స్నానము చేసి, సూర్య నమస్కారము విష్ణు పూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యే స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీముఖము చూచినంతనే సకల దోషములూ కలుగుటయేగాక ఆమె పంది, కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందురు. మాఘమాస స్నానమునకు వయః పరిమితిలేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.

పార్వతీ! దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్త పాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కుల భ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దాన ధర్మములు చేయనివాడునూ, యితరులను వంచించించె వారివద్ద ధనమును హరించిన వాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయు వాడును, బ్రాహ్మణులను హింసించు వాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించు వాడును రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళి చేయువాడును, గర్వముకలవాడై తానే గొప్పవాడనని అహంభావముతో దైవ కార్యములనూ ధర్మ కార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడుపనులకు ప్రేరేపించువాడను యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు.

దేవీ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతః కాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును, అతడు పరమ పదము జేరుటకు అర్హుడగును. శాంభవీ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము (Veda) ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది.

అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్ప కార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వౄద్ధులు, జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలోస్నానము చేయలేరు. కాన, అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించిన యెడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి (Surya Bhagavan) నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచియైన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్ర దానము చేసిన యెడల శుభ ఫలితము కలుగును.

ఈ విధముగా ఆచరించెడి వారిని జూచి, యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికికాని, క్షత్రియునికి కాని, శూద్రునికి కాని మాఘమాస స్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాస స్నానములు చేసినవారిని గాని, చేయలేని వారినికాని, ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక, ఆయుఃక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని,  తలపై నీళ్ళు జల్లుకొని, సూర్యనమస్కారములు చేసి, మాఘపురాణమును (Magha Puranam) చదువుటగాని, వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు.

పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా, వంద అశ్వమేధ యాగములు (Aswamedha yaga) చేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగ్ను. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంత యును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన, నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

Leave a Comment